ప్రతి లక్ష్యాన్ని సాధించడానికి ఐక్యత అవసరమని వివరించే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

June 30th, 11:00 am

మన సంకల్పాలు, ఆలోచనలు, భావోద్వేగాలు అన్నీ ఒకే తాటిపైకి వచ్చినప్పుడు మనం చేపట్టే ప్రతి ప్రయత్నమూ విజయవంతమవుతుంది. భారతవర్షం (భారతదేశం) ప్రతి లక్ష్యాన్ని సాధించడానికి మనమందరం ఇలాంటి ఐక్యతా భావంతోనే ముందుకు సాగాలని ఈ సుభాషితం తెలుపుతుంది.

ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

February 15th, 11:02 am

ఈ రోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. “ఆదిదేవుడైన మహాదేవుడు తన కృపను అందరిపై ఎల్లప్పుడూ నిలుపుగాక! అందరికీ శ్రేయస్సు కలుగుగాక. మన భరతవర్ష శ్రేయస్సు సమున్నత శిఖరాలకు చేరుగాక” అని శ్రీ మోదీ ఆకాంక్షించారు.