బంగ్లాదేశ్ ఎన్నికల విజయంపై తారిఖ్ రహ్మాన్కు అభినందనలు తెలియజేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
February 13th, 04:40 pm
బంగ్లాదేశ్ ఎన్నికల్లో సాధించిన అద్భుత విజయంపై తారిఖ్ రహ్మాన్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ఆయనతో ప్రధాని ఇవాళ ఫోన్లో మాట్లాడారు.బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికల్లో ‘బిఎన్పి’ విజయంపై శ్రీ తారిఖ్ రెహమాన్కు ప్రధానమంత్రి అభినందన
February 13th, 12:13 pm
బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికల్లో ‘బిఎన్పి’ని అఖండ విజయం వైపు నడిపించారంటూ ఆ పార్టీ నాయకుడు శ్రీ తారిఖ్ రెహమాన్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ప్రజాస్వామ్య, ప్రగతిశీల, సమగ్ర బంగ్లాదేశ్కు సదా భారత్ మద్దతు కొనసాగుతుందని శ్రీ మోదీ అన్నారు. “మన బహుముఖ సంబంధాల బలోపేతం, ఉమ్మడి ప్రగతి లక్ష్యాల సాధనలో మీతో సంయుక్తంగా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాను” అని ఆయన పేర్కొన్నారు.బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా మృతికి సంతాపం తెలిపిన పీఎం
December 30th, 10:06 am
ఢాఖాలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బీఎన్పీ ఛైర్పర్సన్ బేగం ఖలీదా జియా మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం వ్యక్తం చేశారు.బేగమ్ ఖలీదా జియా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధానమంత్రి
December 01st, 10:30 pm
బంగ్లాదేశ్ ప్రజా జీవనం లో ఏళ్ల తరబడి సేవలను అందించిన బేగమ్ ఖలీదా జియా ఆరోగ్య స్థితిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ, ఆమె శీఘ్రంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అన్ని విధాలుగా సాయాన్ని అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని శ్రీ మోదీ అన్నారు.ఢాకా విమాన ప్రమాద విషాదంలో ప్రాణనష్టంపై ప్రధాని సంతాపం
July 21st, 07:07 pm
ఢాకా విమాన ప్రమాదంలో జరిగిన ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ విషాదంలో మృత్యువాత పడిన వారిలో యువ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. బంగ్లాదేశ్కు భారత్ సంఘీభావంగా నిలుస్తుందని, సాధ్యమైన మేరకు అన్ని విధాలుగా సహాయ సహహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు.బిమ్స్ టెక్ సదస్సు నేపథ్యంలో బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారుతో సమావేశమైన ప్రధానమంత్రి
April 04th, 03:49 pm
బ్యాంకాక్ లో ఏర్పాటైన బిమ్స్ టెక్ సదస్సు నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సమావేశమయ్యారు.2025 ఏప్రిల్ 03-06 వరకు థాయిలాండ్ మరియు శ్రీలంకలలో ప్రధానమంత్రి పర్యటన
April 02nd, 02:00 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్యాంకాక్లో జరిగే 6వ BIMSTEC శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి (ఏప్రిల్ 3-4, 2025) థాయిలాండ్ను సందర్శిస్తారు. ఆ తర్వాత, అధ్యక్షుడు అనుర కుమార దిసానాయక ఆహ్వానం మేరకు (ఏప్రిల్ 4-6, 2025) శ్రీలంకకు రాష్ట్ర పర్యటనకు బయలుదేరుతారు.శ్రీ శ్రీ హరిచంద్ ఠాకుర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి
March 27th, 03:00 pm
శ్రీ శ్రీ హరిచంద్ ఠాకుర్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. సమాజంలో దగాపడ్డ వర్గాల అభ్యున్నతితోపాటు సమానత్వం, కరుణ, న్యాయం.. వంటి విలువలను పెంపొందింపచేయడానికి శ్రీ ఠాకుర్ కృషి చేశారంటూ శ్రీ మోదీ ప్రశంసించారు. ఈ ఏడాది మతువా ధర్మ మహా మేళాకు శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు.మెగా ఇండియా-యుఎస్ భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్న ప్రధాని మోదీ, ట్రంప్
February 14th, 06:46 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల అమెరికా పర్యటన ఒక చిరస్మరణీయ సందర్భం, ఇది రెండు దేశాల మధ్య లోతైన వ్యూహాత్మక, ఆర్థిక మరియు సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబిస్తుంది. తన పర్యటనలో, ప్రధాని మోదీ అమెరికా నాయకులు, వ్యాపార దిగ్గజాలు మరియు భారతీయ ప్రవాసులతో రక్షణ, వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత మరియు దౌత్యం వంటి కీలక రంగాలను కవర్ చేస్తూ ఉన్నత స్థాయి సమావేశాలు మరియు చర్చలలో పాల్గొన్నారు. ఈ పర్యటన భారతదేశం మరియు అమెరికా మధ్య బలమైన సంబంధాన్ని పునరుద్ఘాటించింది, కొత్త ప్రపంచ క్రమాన్ని రూపొందించడంలో రెండు దేశాలను ప్రపంచ భాగస్వాములుగా ఉంచింది.'Mission Mausam' aims to make India a climate-smart nation: PM Modi
January 14th, 10:45 am
PM Modi addressed the 150th Foundation Day of IMD, highlighting India's rich meteorological heritage and IMD's advancements in disaster management, weather forecasting, and climate resilience. He launched ‘Mission Mausam’ to make India a weather-ready, climate-smart nation and released the IMD Vision-2047 document.భారత వాతావరణ విభాగం (ఐఎండి)150వ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
January 14th, 10:30 am
భారత వాతావరణ విభాగం (ఐఎండి) 150వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నేడు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ‘ఐఎండి’ సాగించిన ఈ 150 ఏళ్ల ప్రయాణం దేశంలో ఆధునిక శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానాల సగర్వ పురోగమనానికి కూడా ప్రతిబింబమని ఆయన అభివర్ణించారు. ఒకటిన్నర శతాబ్దాలుగా కోట్లాది భారతీయులకు సేవలందిస్తున్న ‘ఐఎండి’ ప్రస్థానం భారత శాస్త్రవిజ్ఞాన ప్రగతికి ప్రతీక అని వ్యాఖ్యానించారు. ఇన్నేళ్లుగా ఈ విభాగం సాధించిన విజయాలకు గుర్తుగా స్మారక తపాలాబిళ్లతోపాటు నాణాన్ని కూడా ఇవాళ ఆవిష్కరించామని శ్రీ మోదీ అన్నారు. భారత్ స్వాతంత్య్ర శతాబ్ది వేడుకలు నిర్వహించుకునే 2047నాటికి ఈ సంస్థ భవిష్యత్తును విశదీకరించే ‘ఐఎండి దార్శనిక పత్రం-2047’ను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించామని ఆయన పేర్కొన్నారు. ఒకటిన్నర శతాబ్దాల ‘ఐఎండి’ మహత్తర ప్రస్థానం సందర్భంగా దేశ పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు.అధ్యక్షుడు బిడెన్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంభాషణ
August 26th, 10:03 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఇవాళ అమెరికా అధ్యక్షుడు గౌరవనీయ జోసెఫ్ ఆర్.బిడెన్ ఫోన్ ద్వారా సంభాషించారు.బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు నుంచి ప్రధానమంత్రికి ఫోన్ కాల్
August 16th, 04:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ లోని తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు ప్రొఫెసర్ మొహమ్మద్ యూనస్ తో ఈ రోజు టెలిఫోనులో మాట్లాడారు.బాంగ్లాదేశ్ లో కొత్త బాధ్యతలను స్వీకరించిన నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ ముహమ్మద్ యూనుస్ కు ప్రధాన మంత్రి అభినందనలు
August 08th, 10:26 pm
బాంగ్లాదేశ్ లో కొత్తగా ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వానికి ముఖ్య సలహాదారు పదవీ బాధ్యతలను నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ ముహమ్మద్ యూనుస్ చేపట్టిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు అభినందనలను తెలియజేశారు.బంగ్లాదేశ్ ప్రధానమంత్రి భారత అధికార పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆంగ్ల ప్రసంగం
June 22nd, 01:00 pm
ప్రధానమంత్రి శ్రీమతి షేక్ హసీనాకు, ఆమె ప్రతినిధివర్గానికి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. గత ఏడాది కాలంగా మేం పది సార్లు కలుసుకున్నప్పటికీ నేటి సమావేశం ప్రత్యేకమైనది. మా ప్రభుత్వం మూడో విడత అధికారం చేపడుతున్న సమయంలో మన తొలి అతిథి ఆమె కావడమే ఆ విశేషం.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి అభినందనలనుతెలిపిన బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా గారు
June 05th, 08:04 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బాంగ్లాదేశ్ యొక్క ప్రధాని శేఖ్ హసీనా గారు టెలిఫోన్ ద్వారా మాట్లాడుతూ, లోక్ సభ యొక్క పద్ధెనిమిదో ఎన్నికల లో ఎన్డిఎ విజయం సాధించినందుకు అభినందనల ను తెలియ జేశారు.వరుసగా నాలుగో సారి కూడా విజయం సాధించినందుకు ప్రధానమంత్రి శ్రీమతి షేక్ హసీనాకు పిఎం అభినందనలు
January 08th, 07:54 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి శ్రీమతి షేక్ హసీనాతో మాట్లాడారు. పార్లమెంటరీ ఎన్నికల్లో వరుసగా నాలుగో సారి చారిత్రక విజయం సాధించినందుకు ఆమెను అభినందించారు.త్రిపురలోని ఖోవై-హరీనా రహదారి 135 కి.మీ. మేర అభివృద్ధికి మంత్రివర్గం ఆమోదం
December 27th, 08:36 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ జాతీయ రహదారి-208ని 101.300 కి.మీ. (ఖోవాయి) నుండి 236.213 కి.మీ. (హరీనా) వరకు రెండు లేన్ల మేర అభివృద్ధి & విస్తరణకు ఆమోదం తెలిపింది. త్రిపుర రాష్ట్రంలో దీని మొత్తం పొడవు 134.913 కి.మీ. ఈ మొత్తం ప్రాజెక్ట్ రూ.2,486.78 కోట్ల పెట్టుబడితో చేపడుతున్నారు. ఇందులో రూ.1,511.70 కోట్ల రుణ భాగం (జేపీవై 23,129 మిలియన్లు) ఉంది. లోన్ అసిస్టెంట్ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) నుండి అధికారిక అభివృద్ధి సహాయం (ఓడా) పథకం కింద ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ త్రిపురలోని వివిధ ప్రాంతాల మధ్య మెరుగైన రహదారి కనెక్టివిటీని సులభతరం చేయడానికి మరియు త్రిపుర నుండి అస్సాం మరియు మేఘాలయాలకు ప్రస్తుత ఎన్.హెచ్-8 కాకుండా ప్రత్యామ్నాయ యాక్సెస్ను అందించడానికి ఉద్దేశించబడింది.నవంబరు ఒకటో తేదీన మూడు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్న భారత, బంగ్లాదేశ్ ప్రధానమంత్రులు
October 31st, 05:02 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి శ్రీమతి షేక్ హసీనా నవంబరు ఒకటో తేదీన ఉదయం 11 గంటల ప్రాంతంలో మూడు అభివృద్ధి ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో కలిసి ప్రారంభించనున్నారు. అఖౌరా-అగర్తలా క్రాస్-బోర్డర్ రైల్ లింక్; ఖుల్నా-మోంగ్లా పోర్టు రైల్ లేన్; మైత్రీ సూపర్ ధర్మల్ ప్రాజెక్టు మూడో దశ ఈ మూడు ప్రాజెక్టుల్లో ఉన్నాయి.పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ లో బాంగ్లాదేశ్ పై భారతదేశం క్రికెట్ జట్టు ఘన విజయాన్నిసాధించినందుకు ప్రశంసల ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
October 19th, 10:25 pm
పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ లో బాంగ్లాదేశ్ తో ఆడి చక్కని గెలుపు ను సాధించిన భారతీయ క్రికెట్ జట్టు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.