భారత్-యూకే సంయుక్త ప్రకటన

October 09th, 03:24 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానాన్ని స్వీకరించిన యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్ 2025 అక్టోబర్ 8,9 తేదీల్లో భారత్‌లో అధికార పర్యటన చేశారు. ఆయన వెంట ఆ దేశ వ్యాపార, వాణిజ్య మంత్రి, వాణిజ్య బోర్డు అధ్యక్షుడు పీటర్ కైల్, స్కాట్లాండ్ మంత్రి డోగ్లస్ అలెగ్జాండర్, పెట్టుబడుల మంత్రి జేసన్ స్టాక్‌వుడ్‌తో పాటు 125 మంది సీఈవోలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, సాంస్కృతిక నాయకులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఉంది.

బీహార్‌లోని పూర్ణియాలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం.. శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

September 15th, 04:30 pm

గౌరవనీయులైన గవర్నర్ శ్రీ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, విశేష ప్రజాదరణగల ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్, వేదికపై ఆసీనులైన ఇతర ప్రముఖులతోపాటు సభకు హాజరైన నా ప్రియతమ సోదరీసోదరులారా!

బీహార్‌లోని పూర్ణియాలో దాదాపు 40,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ప్రధానమంత్రి

September 15th, 04:00 pm

బీహార్‌లోని పూర్ణియాలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దాదాపు రూ.40,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసి, ప్రారంభించారు. సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పూర్ణియా ప్రాంతం మాతా పురాణ్ దేవి, భక్త ప్రహ్లాదుడు, మహర్షి మెహిబాబాల ఫుణ్యభూమి అని వ్యాఖ్యానించారు. ఈ నేల ఫణీశ్వరనాథ్ రేణు, సతీనాథ్ బాధురి వంటి సాహిత్య దిగ్గజాలకు జన్మనిచ్చిందన్నారు. ఈ ప్రాంతాన్ని వినోబా భావే వంటి అంకితభావంతో పనిచేసిన కర్మయోగుల భూమిగా అభివర్ణించారు. ఈ భూమి పట్ల తనకున్న ప్రగాఢమైన భక్తిని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

జపాన్ ప్రధానితో కలిసి భారత ప్రధాని సంయుక్త పత్రికా ప్రకటన

August 29th, 03:59 pm

ఈ రోజు మా చర్చ ఫలప్రదంగా, ప్రయోజనకరంగా సాగింది. రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థలుగా, శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా.. మన భాగస్వామ్యం ఈ రెండు దేశాలకే కాకుండా ప్రపంచ శాంతి, స్థిరత్వానికి కూడా చాలా ముఖ్యమైనదని మేమిద్దరం అంగీకరిస్తున్నాం.

ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

July 04th, 09:30 pm

గర్వించదగిన ప్రజాస్వామ్యానికీ, స్నేహపూర్వక దేశానికి ప్రతినిధులుగా ఎన్నికైన మీ ముందు నిలబడటం నాకు ఎంతో గౌరవంగా ఉంది.

ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించిన ప్రధానమంత్రి

July 04th, 09:00 pm

ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. సెనేట్ అధ్యక్షులు వాడే మార్క్, దిగువ సభ స్పీకర్ జగదేవ్ సింగ్ ఆహ్వానం మేరకు హాజరైన ఆయన.. ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన మొదటి ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారు. భారతదేశం, ట్రినిడాడ్ అండ్ టొబాగో ద్వైపాక్షిక సంబంధాలలో ఇది ఒక కీలక కార్యక్రమంగా నిలిచిపోతుంది.

ఘనా పార్లమెంటునుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

July 03rd, 03:45 pm

ప్రజాస్వామ్య స్ఫూర్తి, గౌరవం, దృఢత్వంతో తొణికిసలాడే ఘనా దేశాన్ని సందర్శించడం అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాను. ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రతినిధిగా, నా వెంట 1.4 బిలియన్ భారతీయుల శుభాకాంక్షలను తీసుకువచ్చాను.

ఘనా పార్లమెంటులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

July 03rd, 03:40 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఘనా పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తొలి భారత ప్రధానమంత్రిగా ఆయన నిలిచారు. పార్లమెంట్ స్పీకర్ గౌరవనీయ అల్బన్ కింగ్స్‌ఫోర్డ్ సుమనా బాగ్బిన్ నిర్వహించిన ఈ సమావేశానికి పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వ అధికారులు, ఇరు దేశాల నుంచి విశిష్ట అతిథులు హాజరయ్యారు. ఈ ప్రసంగం భారత్-ఘనా సంబంధాల్లో ఒక ముఖ్యమైన సందర్భంగా నిలిచింది. ఇది రెండు దేశాలను ఏకం చేసే పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించింది.

న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన వరల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్టు సమ్మిట్ ప్లీనరీ సమావేశంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

June 02nd, 05:34 pm

మంత్రివర్గంలో నా సహచరులు రామ్మోహన్ నాయుడు, మురళీధర్ మొహోల్, ఐఏటీఏ బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ పీటర్ ఎల్బర్స్, ఐఏటీఏ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్, ఇండిగో డైరెక్టర్ రాహుల్ భాటియా, అతిథులు, ఆహూతులందరికీ!

ఐఏటీఏ 81వ వార్షిక సర్వసభ్య సమావేశం.. వరల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సమిట్ ప్లీనరీ సమావేశంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

June 02nd, 05:00 pm

విమానయాన రంగంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, కనెక్టివిటీని మెరుగుపరచడం పట్ల తన నిబద్ధతకు అనుగుణంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) 81వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీమ్).. వరల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సమిట్ (డబ్ల్యూఏటీఎస్) ప్లీనరీ సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఈ సమావేశానికి విచ్చేసిన అతిథులను స్వాగతించారు. నాలుగు దశాబ్దాల అనంతరం మళ్లీ ఈ కార్యక్రమాన్ని భారత్‌లో నిర్వహించడంలోని ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ఈ కాలంలో భారత్‌లో చోటుచేసుకున్న సానుకూల మార్పులను ప్రధానంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి, నేటి భారత్ ఎప్పుడూ లేనంత విశ్వాసంతో ఉందని పేర్కొన్నారు. ప్రపంచ వైమానిక రంగంలో భారత పాత్రను ప్రస్తావిస్తూ, విస్తారమైన మార్కెట్‌గా మాత్రమే కాకుండా విధానపరమైన నాయకత్వం, ఆవిష్కరణలు, సమగ్ర అభివృద్ధికి చిహ్నంగా భారత్ నిలిచిందన్నారు. నేడు, అంతరిక్ష-విమానయాన రంగాల్లో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతోంది అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. గత దశాబ్దంలో పౌర విమానయాన రంగం సాధించిన చారిత్రాత్మక పురోగతిని ప్రపంచమంతా చూస్తోందన్నారు.

జూన్ 2న న్యూఢిల్లీలో అంతర్జాతీయ వైమానిక రవాణా సంఘం (ఐఏటీఏ) 81వ వార్షిక సాధారణ సమావేశంలో పాల్గొననున్న ప్రధాని

June 01st, 08:01 pm

అంతర్జాతీయ వైమానిక రవాణా సంఘం (ఐఏటీఏ) 81వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (ఏజీఎమ్) సోమవారం (జూన్ 2న) సాయంత్రం సుమారు 5 గంటలకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించనున్నారు. ప్రపంచ శ్రేణి వైమానిక మౌలిక సదుపాయాల కల్పనను అభివృద్ధి చేయడంతో పాటు అనుసంధానాన్ని పెంచాలన్న తన నిబద్ధతకు అనుగుణంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ ఏజీఎమ్‌లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆహూతులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈనెల 14న హర్యానాలో పర్యటించనున్న ప్రధానమంత్రి

April 12th, 04:48 pm

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈనెల 14న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్యానాలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10:15 గంటలకు హిసార్‌కు చేరుకుని, అక్కడి నుంచి అయోధ్యకు వెళ్లే వాణిజ్య విమానాన్ని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. అలాగే హిసార్ విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనానికి శంకుస్థాపన చేసి, అనంతరం అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో జపాన్-ఇండియా బిజినెస్ కోఆపరేషన్ కమిటీ ప్రతినిధివర్గం భేటీ

March 05th, 07:52 pm

జపాన్-ఇండియా బిజినెస్ కోఆపరేషన్ కమిటీ (జేఐబీసీసీ) చైర్మన్ శ్రీ తాత్సువో యాసునాగా నాయకత్వంలో ఆ కమిటీ సభ్యులు 17 మందితో కూడిన ప్రతినిధివర్గం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఈ రోజు సమావేశమైంది. ఈ ప్రతినిధివర్గంలో తయారీ, బ్యాంకింగ్, విమానసంస్థలు, ఔషధ రంగం, ప్లాంట్ ఇంజినీరింగ్‌లతోపాటు రవాణా వ్యవస్థ (లాజిస్టిక్స్) వంటి ముఖ్య రంగాలకు చెందిన కీలక జపాన్ కంపెనీల సీనియర్ నేతలు ఉన్నారు.

పారిస్ లో భారత్-ఫ్రాన్స్ సీఈవో ఫోరంలో ప్రధాని ప్రసంగం

February 12th, 12:45 am

‘సృజన, సహకారం, అభ్యున్నతి’ని మంత్రప్రదంగా భావించి మీరు ముందుకు సాగుతుండడాన్ని నేను గమనించాను. మీరు కేవలం ఉన్నతాధికారుల మధ్య వారధులు మాత్రమే కాదు.. భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మీరు బలోపేతం చేస్తున్నారు.

భారతదేశంపై ఈ వారం ప్రపంచం

February 10th, 06:40 pm

ఈ వారం, భారతదేశం మరియు భారతీయులు ప్రపంచ వేదికపై తమ అద్భుతమైన ఆరోహణను కొనసాగించారు, అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేశారు, అంతరిక్ష సాంకేతికతలో పురోగతి సాధించారు మరియు వివిధ రంగాలలో విజయాలను సాధించారు. ఆగ్నేయాసియాతో లోతైన సంబంధాలను పెంపొందించుకోవడం నుండి కృత్రిమ మేధస్సు మరియు విమానయానాన్ని అభివృద్ధి చేయడం వరకు, భారతదేశం యొక్క పురోగతి ప్రపంచ వాటాదారులకు కీలకమైన దృష్టిగా ఉంది. ఈ వారం నుండి కొన్ని ప్రధాన ముఖ్యాంశాలను ఇక్కడ చూడండి.

'మన్ కీ బాత్' శ్రోతలే ఈ కార్యక్రమానికి నిజమైన యాంకర్లు: ప్రధాని మోదీ

September 29th, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. మరోసారి 'మన్ కీ బాత్' కార్యక్రమంతో మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది. ఈరోజు ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తోంది. ఇది చాలా పాత జ్ఞాపకాలతో నన్ను చుట్టుముట్టింది. కారణం మన 'మన్ కీ బాత్' ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. పదేళ్ల కిందట విజయదశమి పర్వదినమైన అక్టోబర్ 3వ తేదీన 'మన్ కీ బాత్' ప్రారంభమైంది. ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీన ‘మన్ కీ బాత్’ పదేళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంటుంది. యాదృచ్ఛికంగా అది నవరాత్రుల మొదటి రోజు కావడం విశేషం.

న్యూ ఢిల్లీ లో జరిగిన రెండో ఆసియా పసిఫిక్ పౌర విమానయాన మంత్రుల సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

September 12th, 04:00 pm

వివిధ దేశాలకు చెందిన ప్రముఖులందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో మీరు ఈ రంగానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించారు. పౌర విమానయాన రంగంలో ఉన్న మేధావులు ప్రస్తుతం మన మధ్యలో ఉన్నారని నేను నమ్ముతున్నాను, ఇది మన సమష్టి నిబద్ధతను, ఆసియా పసిఫిక్ ప్రాంత సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ సంస్థ 80 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, మా మంత్రి శ్రీ నాయుడు మార్గదర్శకత్వం, నాయకత్వంలో, 'ఏక్ పేడ్ మా కే నామ్' (తల్లి పేరు మీద ఒక చెట్టు) తో 80,000 చెట్లను నాటే ఒక ప్రధాన కార్యక్రమం చేపట్టబడింది. అయితే, నేను మరొక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. మా దేశంలో ఒక వ్యక్తి 80 ఏళ్ళకు చేరుకున్నప్పుడు, దానిని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వేడుకగా జరుపుకుంటారు. మన పూర్వీకుల ప్రకారం, 80 ఏళ్ళకు చేరుకోవడం అంటే వెయ్యి పౌర్ణమి చంద్రులను చూసే అవకాశం కలిగి ఉండటం. ఒకరకంగా చెప్పాలంటే మన సంస్థ కూడా వెయ్యి పౌర్ణమిలను ప్రత్యక్షంగా వీక్షించి, దగ్గరగా చూసిన అనుభవం కలిగింది. ఈ 80 సంవత్సరాల ప్రయాణం ఒక చిరస్మరణీయ ప్రయాణం, విజయవంతమైన ప్రయాణం, అభినందనలకు అర్హమైనది.

‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్’ పట్ల లాక్ హీడ్ మార్టిన్ నిబద్ధతను ప్రశంసించిన ప్రధాన మంత్రి

July 19th, 11:50 am

‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్’ దార్శనికతను సాకారం చేసే దిశలో ప్రముఖ రక్షణ రంగ సంస్థ లాక్ హీడ్ మార్టిన్ కనబరుస్తున్న నిబద్ధతను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

Congress has always been an anti-middle-class party: PM Modi in Hyderabad

May 10th, 04:00 pm

Addressing his second public meeting, PM Modi highlighted the significance of Hyderabad and the determination of the people of Telangana to choose BJP over other political parties. Hyderabad is special indeed. This venue is even more special, said PM Modi, reminiscing about the pivotal role the city played in igniting hope and change a decade ago.

PM Modi addresses public meetings in Mahabubnagar & Hyderabad, Telangana

May 10th, 03:30 pm

Prime Minister Narendra Modi addressed public meetings in Mahabubnagar & Hyderabad, Telangana, emphasizing the significance of the upcoming elections for the future of the country. Speaking passionately, PM Modi highlighted the contrast between the false promises made by Congress and the concrete guarantees offered by the BJP-led government.