మే 31న మధ్యప్రదేశ్‌లో ప్రధాని పర్యటన

May 30th, 11:15 am

లోకమాత దేవీ అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మే 31న మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు. భోపాల్‌లో ఉదయం 11:15 గంటలకు లోకమాత దేవీ అహల్యాబాయి మహిళా సశక్తికరణ్ మహాసమ్మేళనంలో ఆయన పాల్గొంటారు. భోపాల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు.