ఆసియా అభివృద్ధి బ్యాంకు అధ్యక్షుడు శ్రీ మసాటో కందాతో ప్రధానమంత్రి భేటీ

June 01st, 04:35 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఆసియా అభివృద్ధి బ్యాంకు అధ్యక్షుడు శ్రీ మసాటో కందాతో సమావేశమయ్యారు. గత దశాబ్దంలో భారత్‌ సాధించిన వేగవంతమైన అభివృద్ధి లెక్కలేనంత మందికి సాధికారత కల్పించింది. ఈ ప్రయాణంలో మరింత వేగాన్ని తీసుకొచ్చేందుకు మేం కృషి చేస్తున్నాం అని ప్రధాని అన్నారు.

జాతీయ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) నవీకరణ, అయిదు జాతీయ అత్యున్నత నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు పథకానికి క్యాబినెట్ ఆమోదం

May 07th, 02:07 pm

జాతీయ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) నవీకరణతోపాటు అయిదు (5) జాతీయ అత్యున్నత నైపుణ్యాభివృద్ధి కేంద్రాల (ఎన్‌సీవోఈ) ఏర్పాటు పథకానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రాయోజిత పథకంగా దీన్ని రూపొందించారు. భారత్‌లో వృత్తి విద్యలో విప్లవాత్మక మార్పుల దిశగా ఇది ముఖ్యమైన ముందడుగు.