2025 ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో భారతీయ బృందం బ్రహ్మాండమైన ప్రదర్శన: ప్రధానమంత్రి అభినందనలు

June 02nd, 03:01 pm

దక్షిణ కొరియాలో ఇటీవల నిర్వహించిన 2025 ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొని బ్రహ్మాండమైన ప్రదర్శనను ఇచ్చిన భారతీయ దళాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘‘క్రీడాకారుల్లో ప్రతి ఒక్కరి కఠోర శ్రమ, దృఢ సంకల్పం అన్ని పోటీల్లో స్పష్టంగా కనిపించాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.

ఇరవై అయిదో ఏశియన్ అథ్లెటిక్స్ చాంపియన్ శిప్ 2023 లో27 పతకాల ను గెలిచినందుకు భారతదేశం దళాని కి అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి

July 17th, 12:17 pm

ఇరవై అయిదో ఏశియన్ అథ్లెటిక్స్ చాంపియన్ శిప్ 2023 లో అద్భుతమైనటువంటి ప్రదర్శన ను ఇచ్చినందుకు గాను భారతదేశం యొక్క క్రీడాకారులు, క్రీడాకారిణుల దళాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. భారతీయ క్రీడాకారులు, క్రీడాకారిణుల దళం ఈ చాంపియన్ శిప్ లో 27 పతకాల ను చేజిక్కించుకొని విదేశీ గడ్డ మీద జరిగిన ఏదైనా చాంపియన్ శిప్ లో ఇంతవరకు అన్నిటికంటే ఎక్కువ పతకాల ను గెలిచిన కీర్తిప్రమాణాన్ని ఏర్పరచింది.