‘ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌ 2025’లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత విలువిద్య క్రీడాకారుల జట్టును అభినందించిన ప్రధానమంత్రి

November 17th, 05:59 pm

ఈ పోటీలో దేశ విలువిద్య జట్టు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిందని, 6 స్వర్ణాలు సహా మొత్తం 10 పతకాలను సాధించిందని శ్రీ మోదీ అన్నారు. 18 సంవత్సరాల తర్వాత సాధించిన చారిత్రాత్మక రికర్వ్ పురుషుల విభాగంలో స్వర్ణ పతకం సాధించడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. వ్యక్తిగత విభాగాల్లో ఉత్తమ ప్రదర్శనలు, కాంపౌండ్ విభాగంలో విజయవంతమైన టైటిల్ రక్షణలు కూడా ప్రధానమంత్రి ప్రశంసించారు.