జనవరి 23న కేరళలో పర్యటించనున్న ప్రధానమంత్రి
January 22nd, 02:23 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 23న కేరళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. తిరువనంతపురంలో ఉదయం 10.45 గంటలకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేయడంతోపాటు కొన్నింటికి ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి శ్రీ మోదీ ప్రసంగిస్తారు.విశాఖ రిఫైనరీలో అవశేషాల ఉన్నతీకరణ సదుపాయం ప్రారంభం..ప్రధానమంత్రి ప్రశంసలు
January 06th, 08:50 am
ఆంధ్రప్రదేశ్లోని విశాఖ రిఫైనరీలో హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్)కు చెందిన అవశేషాల ఉన్నతీకరణ సదుపాయాన్ని (ఆర్యూఎఫ్) విజయవంతంగా ప్రారంభించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసించారు. ఇంధన భద్రత, స్వయంసమృద్ధి సాధన దిశగా భారత్ ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని ఆయన వర్ణించారు.కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ)
December 31st, 03:11 pm
ఒడిశా రాష్ట్రంలో ‘ఎన్హెచ్(ఓ)’ కింద ‘ఈపీసీ’ పద్ధతిలో ప్రస్తుత 2 వరుసల జాతీయ రహదారిని అంచుల చదును సహా విస్తరణ-బలోపేతం చేసే పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి ఇవాళ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఎన్హెచ్-326 పరిధిలో 68.600 కిలోమీటరు నుంచి 311.700 కిలోమీటరు వరకూ రహదారిని రెండు వైపులా అంచుల చదును (పేవ్డ్ షోల్టర్స్) సహా ఉన్నతీకరిస్తారు.'వికసిత భారత్' సంకల్పం తప్పక నెరవేరుతుంది: మన్ కీ బాత్లో ప్రధాని మోదీ
December 28th, 11:30 am
ఈ ఏడాది చివరి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, 2025 సంవత్సరంలో జాతీయ భద్రత, క్రీడలు, సైన్స్ ప్రయోగశాలలు మరియు అంతర్జాతీయ వేదికలపై భారతదేశం తనదైన ముద్ర వేసిందని అన్నారు. నవసంకల్పాలతో 2026లో ముందుకు సాగడానికి దేశం సిద్ధంగా ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్, క్విజ్ పోటీ, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025 మరియు ఫిట్ ఇండియా ఉద్యమం వంటి యువత కేంద్రీకృత కార్యక్రమాలను కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు.ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామ రాజు జిల్లాలో బస్సు ప్రమాదం.. ప్రాణనష్టం.. సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
December 12th, 09:09 am
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామ రాజు జిల్లాలో బస్సు ప్రమాదం ప్రాణనష్టానికి దారితీసినందుకు ప్రదానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల వంతున, గాయపడ్డ వారికి రూ.50,000 వంతున ఎక్స్గ్రేషియాను అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఆత్మీయ స్వాగతం
November 19th, 01:46 pm
సాయిరాం నామ స్మరణ నడుమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తికి చేరుకున్నారు. స్థానికులు అత్యంత ఆత్మీయంగా ప్రధానమంత్రికి స్వాతం పలికారు.నవంబరు 19న ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటన
November 18th, 11:38 am
నవంబరు 19న ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి సంతాపం
November 01st, 01:59 pm
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట కారణంగా ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో దురదృష్టకర ఘటన.. ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం
October 24th, 09:02 am
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో దురదృష్టవశాత్తు చోటుచేసుకున్న ఘటన ప్రాణనష్టానికి దారితీసింది. దీనిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పున, ఇదే ఘటనలో గాయపడ్డ వారికి రూ.50,000 చొప్పున పరిహారం అందజేస్తామని ప్రధానమంత్రి తెలిపారు.ఆంధ్రప్రదేశ్ పర్యటన వివరాలను పంచుకున్న ప్రధానిఆంధ్రప్రదేశ్ పర్యటన వివరాలను పంచుకున్న ప్రధాని
October 16th, 09:55 pm
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు సంబంధించిన వివరాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో శ్రీ మోదీ పూజలు చేశారు. శ్రీ శివాజీ ధ్యాన మందిర్, శ్రీ శివాజీ దర్బార్ హాలును సందర్శించారు. అనంతరం, రూ.13,430 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు కర్నూల్లో శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు.ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
October 16th, 03:00 pm
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, ప్రజాదరణ పొందిన, కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రులు శ్రీ కె.రామ్మోహన్ నాయుడు గారు, శ్రీ చంద్రశేఖర్ పెమ్మసాని గారు, శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు, రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, ఇతర మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు, పార్లమెంట్ సభ్యులు, ఎంఎల్ఏలు అందరికీ, మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన నా ప్రియమైన సోదరీసోదరులకు...ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో రూ.13,430 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన.. ప్రారంభోత్సవం.. కొన్నింటిని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 16th, 02:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో దాదాపు రూ.13,430 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- తొలుత అహోబిలంలోని నరసింహ స్వామితోపాటు మహానందిలోని శ్రీ మహానందీశ్వర స్వామికి ప్రణామాలు అర్పించారు. అలాగే సకలజన సౌభాగ్యం ఆకాంక్షిస్తూ మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు కోరారు.అక్టోబరు 16న ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్న ప్రధాని
October 14th, 05:48 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 16న ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. ఉదయం 11:15 గంటల సమయంలో నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రత్యేక పూజలతోపాటు దర్శనం చేసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12:15 గంటలకు శ్రీశైలంలోని శ్రీ శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు.ప్రధానమంత్రిని కలిసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
October 13th, 06:29 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శ్రీ ఎన్. చంద్రబాబునాయుడుకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
October 11th, 10:15 pm
ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శ్రీ ఎన్. చంద్రబాబునాయుడుతో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు.ఆంధ్రప్రదేశ్... కోనసీమ జిల్లాలో దుర్ఘటన… ప్రాణనష్టం సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
October 08th, 05:40 pm
ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఓ దుర్ఘటన ప్రాణనష్టానికి దారితీసిన సంగతి తెలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.ఒడిశా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్లో రూ.4600 కోట్ల వ్యయంతో సెమీకండక్టర్ తయారీ యూనిట్ల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం
August 12th, 03:18 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) కింద మరో నాలుగు సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.29 జూన్ 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 123 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
June 29th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మీ అందరికీ అభినందనలు. మీరందరూ యోగా శక్తితో, అంతర్జాతీయ యోగా దినోత్సవ జ్ఞాపకాలతో నిండిపోయి ఉండాలి. ఈసారి కూడా జూన్ 21వ తేదీన, మనదేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుండి కోట్లాది మంది అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మీకు గుర్తుందా! ఇది 10 సంవత్సరాల కిందట ప్రారంభమైంది. ఇప్పుడు 10 సంవత్సరాలలో ఈ ధోరణి ప్రతి సంవత్సరం మరింత గొప్పగా మారుతోంది. ఎక్కువ మంది ప్రజలు తమ దైనందిన జీవితంలో యోగాను అవలంబిస్తున్నారని ఇది సూచిస్తుంది. ఈసారి యోగా దినోత్సవ ఆకర్షణీయమైన చిత్రాలను మనం చాలా చూశాం. విశాఖపట్న సముద్ర తీరంలో మూడు లక్షల మంది కలిసి యోగా చేశారు. మరో అద్భుతమైన దృశ్యం కూడా విశాఖపట్నం నుండే వచ్చింది. రెండు వేలకు పైగా గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేసిన దృశ్యమది. ఊహించుకోండి! ఎంత క్రమశిక్షణ, ఎంత అంకితభావం ఉండి ఉంటుందో! మన నావికాదళ నౌకల్లో కూడా గొప్ప యోగా ప్రదర్శన కనిపించింది. తెలంగాణలో మూడు వేల మంది దివ్యాంగులు కలిసి యోగా శిబిరంలో పాల్గొన్నారు. సాధికారతకు యోగా ఎలా మాధ్యమం అవుతుందో వారు నిరూపించారు. ఢిల్లీ ప్రజలు యోగాను పరిశుభ్రమైన యమునా సంకల్పంతో అనుసంధానించి, యమునా నది ఒడ్డుకు వెళ్లి యోగా చేశారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అయిన జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ వంతెన వద్ద కూడా ప్రజలు యోగా చేశారు. హిమాలయాల మంచు శిఖరాల్లో ఐటీబీపీ సైనికులు చేసిన యోగా కనిపించింది. సాహసం, సాధన కలిసి సాగాయి. గుజరాత్ ప్రజలు కూడా కొత్త చరిత్రను సృష్టించారు. వడ్ నగర్లో 2121 మంది కలిసి భుజంగాసనం వేసి కొత్త రికార్డు సృష్టించారు. న్యూయార్క్, లండన్, టోక్యో, పారిస్ మొదలైన ప్రపంచంలోని ప్రతి పెద్ద నగరం నుండి యోగా చిత్రాలు వచ్చాయి. ప్రతి చిత్రంలో ఒక విషయం ప్రత్యేకంగా ఉంది. శాంతి, స్థిరత్వం, సమతుల్యత ఆ చిత్రాల్లో అంతర్భాగంగా ఉన్నాయి. ఈసారి థీమ్ కూడా చాలా ప్రత్యేకమైంది. యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్.. అంటే 'ఒక భూమి - ఒక ఆరోగ్యం'. ఇది కేవలం నినాదం కాదు. ఇది 'వసుధైవ కుటుంబకం' అని మనల్ని అనుభూతి చెందించే దిశ. ఈ సంవత్సరం యోగా దినోత్సవ గొప్పతనం ఖచ్చితంగా ఎక్కువ మందిని యోగాను స్వీకరించడానికి ప్రేరేపిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.యోగా ఉద్యమాన్ని బలపరచడానికి ఆంధ్ర ప్రదేశ్ నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి ప్రధానమంత్రి ప్రశంసలు
June 22nd, 02:10 pm
యోగాను దైనందిన జీవనంలో ఒక భాగంగా చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూపిన ప్రేరణదాయక నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసించారు. ఆరోగ్యం, వెల్నెస్ కోసం చేపట్టిన దేశవ్యాప్త ఉద్యమానికి దీనితో మరింత ప్రోత్సాహం లభిస్తుందని ఆయన అన్నారు.విశాఖపట్నంలో జరిగిన యోగా దినోత్సవ వేడుకల చిత్రాలు
June 21st, 09:46 am
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. వివిధ యోగాసనాలు వేయడంలో ఆయన అనేక మంది యోగా సాధకులతో కలిసి పనిచేశారు. యోగా అందరినీ ఏకం చేసిందని పేర్కొంటూ, యోగా అందరికీ, సరిహద్దులకు అతీతంగా, నేపథ్యాలకు అతీతంగా, వయస్సు లేదా సామర్థ్యానికి అతీతంగా ఉంది అని ప్రధాని వ్యాఖ్యానించారు.