వన్యప్రాణులను సంరక్షించే, వాటిని ప్రమాదాల నుంచి రక్షించే, పునరాశ్రయాన్ని కల్పించే కేంద్రం ‘వన్‌తారా’ను ప్రారంభించిన ప్రధానమంత్రి

March 04th, 04:05 pm

వన్యప్రాణులను సంరక్షించడం, వాటిని ప్రమాదాల బారి నుంచి కాపాడడం, వన్యప్రాణులకు పునరాశ్రయాన్ని కల్పించడానికి ఉద్దేశించిన ‘వన్‌తారా’ కేంద్రాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్‌లోని జాంనగర్‌లో ఈ రోజు ప్రారంభించారు. శ్రీ అనంత్ అంబానీతోపాటు ఆయన బృందం దయాభరిత ప్రయత్నాలను శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. వన్‌తారా వన్యప్రాణుల సంక్షేమాన్ని, పర్యావరణ సుస్థిరత్వాన్ని ప్రోత్సహిస్తూనే వన్యప్రాణులకు ఒక సంరక్షణ కేంద్రంగా పనిచేస్తుందని ఆయన అభివర్ణించారు.