పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

March 14th, 02:15 pm

గవర్నర్ ఆర్ ఎన్ రవి గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శంతను ఠాకూర్ గారు, సుకాంత మజుందార్ గారు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకులు సువేందు అధికారి గారు, నా తోటి పార్లమెంటు సభ్యులు శమిక్ భట్టాచార్య గారు, ఇతర ప్రజా ప్రతినిధులు, సోదరీ సోదరులారా!

PM Modi lays foundation stone, inaugurates various development works worth Rs.18,700 crore in Kolkata, West Bengal

March 14th, 02:00 pm

Inaugurating development works worth over ₹18,000 crore in Kolkata, West Bengal, PM Modi said a new chapter of development is being written for the state and Eastern India. The projects span key sectors such as roads, railways and ports. These initiatives will benefit farmers, traders, entrepreneurs, students and every section of society, laying the foundation for a developed Bengal.

ఈ నెల 14న పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్న ప్రధానమంత్రి

March 12th, 05:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 14న పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రధానమంత్రి కోల్‌కతాలో దాదాపు రూ.18,680 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు.

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

February 22nd, 01:30 pm

బాబా ఔఘర్‌నాథ్ పుణ్యభూమి, విప్లవనేల మీరట్‌లో ఇవాళ వికసిత్ ఉత్తరప్రదేశ్, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు నూతనోత్తజం పరుగులు పెడుతోంది. తొలిసారిగా ఒకే వేదిక నుంచి నమో భారత్ రాపిడ్ రైలు, మెట్రో సర్వీసులు ప్రారంభమమయ్యాయి. అభివృద్ధి చెందిన భారతదేశంలోని రవాణా వ్యవస్థకు ఇది అద్భుతమైన ఉదాహరణ. నగరంలో ప్రయాణించేందుకు మెట్రో, జంట నగరాల అనుసంధానానికి అత్యాధునిక నమో భారత్ రైలు అందుబాటులోకి వచ్చాయి. అభివృద్ధిలో ఉత్తరప్రదేశ్ కీలకఘట్టానికి చేరుకున్నందుకు నాకు సంతృప్తిగా ఉంది.

భారత తొలి నమో భారత్ ఆర్ ఆర్ టీ ఎస్ ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ; ఢిల్లీ - మీరట్ నమో భారత్ కారిడార్‌ జాతికి అంకితం

February 22nd, 01:12 pm

మీరట్‌లో నమో భారత్ రాపిడ్ రైల్, మీరట్ మెట్రో మార్గాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును 'వికసిత ఉత్తరప్రదేశ్' 'వికసిత భారత్' కోసం ఒక సరికొత్త శక్తిగా ఆయన అభివర్ణించారు. భారతదేశంలో ఒకే ప్లాట్‌ఫారమ్ నుంచి రాపిడ్ రైల్, మెట్రో సర్వీస్ రెండూ ఒకే రోజు ప్రారంభం కావడం ఇదే తొలిసారి.

అయోధ్యలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, అంకితం , శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం

December 30th, 02:15 pm

మోడీ హామీకి అంత బలం ఉంది ఎందుకంటే మోడీ ఏదైనా చెప్పినప్పుడు, దానిని నెరవేర్చడానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేస్తారు. మోడీ హామీపై నేడు దేశంలో నమ్మకం ఉంది, ఎందుకంటే మోడీ హామీ ఇచ్చినప్పుడు, దానిని నెరవేర్చడానికి ఆయన రాత్రింబవళ్లు కష్టపడతారు. అయోధ్య నగరం కూడా దీనికి సాక్ష్యం. ఈ పవిత్రమైన నగరాన్ని అభివృద్ధి చేయడంలో మేము ఏ మాత్రం వెనకడుగు వేయబోమని ఈ రోజు నేను అయోధ్య ప్రజలకు భరోసా ఇస్తున్నాను. శ్రీరాముడు మనందరినీ ఆశీర్వదించాలి, ఈ కోరికతో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. శ్రీరాముని పాదాలకు నమస్కరిస్తున్నాను. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. నాతో కలిసి ఇలా చెప్పండి:

ప్రధానమంత్రి చేతులమీదుగా రూ.15,700 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి పథకాలు ప్రారంభం.. జాతికి అంకితం.. శంకుస్థాపన

December 30th, 02:00 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉత్త‌రప్ర‌దేశ్‌లోని అయోధ్య క్షేత్రంలో రూ.15,700 కోట్లకుపైగా విలువైన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, జాతికి అంకితం, శంకుస్థాపన చేశారు. వీటిలో అయోధ్య, దాని పరిసర ప్రాంతాల్లోని సుమారు రూ.11,100 కోట్ల విలువైన ప్రాజెక్టులతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన రూ.4600 కోట్ల విలువైన కార్యక్రమాలున్నాయి. దీనికిముందు పునర్నవీకృత అయోధ్య రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ఆయన, కొత్త అమృత భారత్, వందే భారత్ రైళ్లను జెండా ఊపి సాగనంపారు. వీటితోపాటు అనేక ఇతర రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత అయోధ్యలో కొత్త విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభించి, దీనికి ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం’గా నామకరణం చేశారు.

డెహ్రాడూన్‌-ఢిల్లీ మధ్య వందే భారత్‌ ఎక్స్’ప్రెస్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ప్రసంగం తెలుగు పాఠం

May 25th, 11:30 am

ఉత్తరాఖండ్ గవర్నర్ శ్రీ గుర్మీత్ సింగ్, ప్రజాదరణగల ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి, రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పరిషత్ సభ్యులు, ఇతర ప్రముఖులుసహా ఉత్తరాఖండ్‌లోని నా ప్రియతమ సోదర సోదరీమణులు…అందరికీ వందనాలు! రాష్ట్రం నుంచి వందే భారత్ ఎక్స్‌’ప్రెస్ రైలు ప్రారంభిస్తున్న సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రజలందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను.

డెహ్రాడూన్ - ఢిల్లీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభించిన ప్రధానమంత్రి

May 25th, 11:00 am

డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. కొత్తగా విద్యుదీకరణ చేసిన రైలు మార్గాలను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి, ఉత్తరాఖండ్ ను నూరు శాతం విద్యుత్ రైలు మార్గాల (100% ఎలక్ట్రిక్ ట్రాక్షన్) రాష్ట్రంగా ప్రకటించారు.