పవిత్ర శ్రీ అమర్‌నాథ్ యాత్ర ఆరంభమైన వేళ శివ భక్తులందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు.. సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని

July 03rd, 03:56 pm

పవిత్ర శ్రీ అమర్‌నాథ్ యాత్ర ఈ రోజు నుంచి మొదలైన సందర్భంగా శివ భక్తులందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ఆయన ఇలా పంచుకున్నారు:

పవిత్ర యాత్ర సందర్భంగా.. అయిదు సంకల్పాలతో అమర్‌నాథ్ యాత్రికులకు ప్రధానమంత్రి లేఖ

July 03rd, 03:53 pm

ఈ యేడు అమర్‌నాథ్ యాత్రకు వెళ్తున్న భక్తులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వారి తీర్థయాత్ర అన్నివిధాలా సురక్షితంగా, మంగళప్రదంగా సాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘హిమలింగాన్ని దర్శించుకునే అమర్‌నాథ్ యాత్ర.. మన ఆధ్యాత్మిక సంప్రదాయంలో, సాంస్కృతిక ఏకతలో శాశ్వతమైన అధ్యాయం’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.