న్యూఢిల్లీలోని కరియప్ప మైదానంలో ఎన్‌సీసీ ర్యాలీలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

January 28th, 04:00 pm

కేంద్ర క్యాబినెట్లో నా సహ మంత్రి, రక్షణ మంత్రి రాజనాథ్‌ సింగ్‌జీ, వేదికపై ఉన్న అతిథులు, దేశం నలుమూలల నుంచి వచ్చిన ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు, శకటాల కళాకారులు, రాష్ట్రీయ రంగశాల ఉద్యోగులు, నా యువ మిత్రులు.. మీ అందరి కృషి ఇక్కడ కనిపిస్తోంది. మంచి సమన్వయంతో మీరు చక్కటి ప్రదర్శన ఇచ్చారు.

ఢిల్లీలో జరిగిన వార్షిక ఎన్‌సీసీ పీఎం ర్యాలీలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

January 28th, 03:30 pm

ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో ఈ రోజు నిర్వహించిన వార్షిక ‘ఎన్‌సీసీ పీఎం ర్యాలీ’ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఎన్‌సీసీ దినోత్సవం సందర్భంగా సభికులనుద్దేశించి ప్రసంగిస్తూ, ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ కేడెట్లు, నాటక కళాకారులు, జాతీయ రంగశాల కళాకారులు, దేశంలోని వివిధ ప్రాంతాల యువ ప్రతినిధుల కృషి.. సమన్వయంతో కూడిన ఈ ప్రదర్శనలో స్పష్టంగా కనిపిస్తోందని ప్రశంసించారు. నేటి ఉదయం మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ అజిత్ పవార్ గారితోపాటు కొందరు సహచరులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధానమంత్రి శ్రీ మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన దేశానికి ఎంతో శోకాన్ని మిగిల్చిందని ఆవేదన చెందారు. మహారాష్ట్రతోపాటు దేశాభివృద్ధిలో అజిత్ దాదా విశేష కృషి చేశారని ప్రధానమంత్రి కొనియాడారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి నిరంతరం శ్రమించారని గుర్తుచేశారు. అజిత్ పవార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు దేశమంతా అండగా ఉంటుందని ప్రధానమంత్రి భరోసా ఇచ్చారు. ఈ విషాద సమయంలోనూ, అక్కడకు వచ్చిన ఎన్‌సీసీ క్యాడెట్లకు, ముఖ్యంగా మిత్ర దేశాల నుంచి వచ్చిన వారికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది బాలికల భాగస్వామ్యం పెరగడంపై హర్షం వ్యక్తం చేశారు.

మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం

January 28th, 11:22 am

మహారాష్ట్రలోని బారామతి జిల్లాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. ఈ తీవ్ర విషాద సమయంలో మృతుల కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

అజిత్ పవార్ మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి

January 28th, 11:16 am

శ్రీ అజిత్ పవార్ మరణం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రజలకు సేవ చేయడంలో ముందు వరుసలో ఉండే కష్టపడే వ్యక్తిగా శ్రీ అజిత్ పవార్ విస్తృత గౌరవాన్ని పొందారని ప్రధాని పేర్కొన్నారు. పాలనాపరమైన విషయాలపై ఆయనకు ఉన్న అవగాహన.. పేదలు, అణగారిన వర్గాల సాధికారత పట్ల ఆయనకు ఉన్న అంకితభావం కూడా ఎంతో గమనార్హమైనవని అన్నారు. “ఆయన అకాల మరణం చాలా దిగ్భ్రాంతికరమైనది.. విచారకరమైనది. ఆయన కుటుంబ సభ్యులు, అసంఖ్యాక అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని ప్రధాని వ్యాఖ్యానించారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

December 05th, 08:45 pm

మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ కు ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఏక్‌నాథ్ షిండే, శ్రీ అజిత్ పవార్‌ కు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రలో అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని శ్రీ మోదీ హామీ ఇచ్చారు.