నైజీరియా అధ్యక్షునితో అధికారిక చర్చలు జరిపిన ప్రధానమంత్రి
November 17th, 06:41 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 17, 18 తేదీల్లో తన నైజీరియా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుతో అబుజాలో ఈ రోజు అధికారిక చర్చలు జరిపారు. స్టేట్ హౌస్కు చేరుకున్న అనంతరం ప్రధానికి 21 తుపాకులతో గౌరవ వందనంతో లాంఛనంగా స్వాగతం పలికారు.